AP News: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఘరానా మోసం

ABN , First Publish Date - 2022-09-03T14:54:57+05:30 IST

పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో ఘరానా మోసం (Fraud) వెలుగులోకి వచ్చింది.

AP News: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఘరానా మోసం

పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో ఘరానా మోసం (Fraud) వెలుగులోకి వచ్చింది. అమెరికా వీసా (US visa) పేరుతో ఓ మహిళకు మోసగాడు రూ. 48 లక్షలకు టోకరా వేశాడు. పెళ్లి సంబంధం కోసం గత జులైలో జీవన్‌సాధి మ్యాట్రిమోనీ (Matrimony)లో నరసరావుపేట, రామిరెడ్డి పేటకు చెందిన యం.స్వరూపరాణి పేరు నమోదు చేసుకుంది. అయితే విశాఖపట్నం ఎంవీవీ కాలనీకి చెందిన కొచ్చర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి యాప్‌లో తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నానని స్వరూపరాణిని నమ్మించాడు. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడదామని చెప్పి.. వీసా పేరుతో పలు దఫాలుగా రూ. 48 లక్షలు ఆమె నుంచి తీసుకున్నాడు. తర్వాత శ్రీకాంత్ నుంచి స్పందన లేకపోవడంతో దొంగ వ్యవహారాన్ని పసిగట్టిన స్వరూపారాణి, తన తమ్ముడు సహాయంతో నరసరావుపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-03T14:54:57+05:30 IST