Lokesh: జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

ABN , First Publish Date - 2022-10-01T00:44:57+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)కు టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) లేఖ రాశారు. వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనాలని డిమాండ్ చేశారు.

Lokesh: జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

అమరావతి: సీఎం జగన్‌ (CM Jagan)కు టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) లేఖ రాశారు. వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనాలని డిమాండ్ చేశారు. సుబాబుల్ పంట కొనుగోళ్లలోనూ.. రైతుల కులం, ప్రాంతం చూసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పంటను మద్దతుధరకు అమ్మడానికి రైతులు కష్టాలు పడుతున్నారని, రైతుల పంటను వైసీపీకి చెందినవారికే విక్రయించాలనే.. నూతన సంస్కృతి ఏపీలో రావడం దురదృష్టకరమన్నారు. పంటను దళారులకు విక్రయించినా ధరలో కోత పెడుతున్నారని, దళారులకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. గిట్టుబాటు ధరలేక తీవ్రనష్టాల్లో సుబాబుల్ రైతులున్నారని తెలిపారు. పంటను ఎక్కడైనా అమ్ముకునే హక్కు రైతులకు ఉందని తెలిపారు. సుబాబుల్ పంట కొనుగోళ్లలో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాలని లేఖలో లోకేష్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-10-01T00:44:57+05:30 IST