Murder case: పల్నాడు జిల్లా, మాచర్ల మండలంలో దారుణం
ABN , First Publish Date - 2022-07-31T13:35:57+05:30 IST
మాచర్ల (Macharla) మండలం, కొత్తపల్లి (Kothapalli)లో దారుణం జరిగింది.
పల్నాడు (Palnadu) జిల్లా: మాచర్ల (Macharla) మండలం, కొత్తపల్లి (Kothapalli)లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్న కొడుకునే తల్లిదండ్రులు హత్య (Murder) చేశారు. అనంతరం ఆ మృత దేహాన్ని మూట కట్టి పొలంలో పూడ్చి పెట్టారు. పొలంలో వ్యవసాయ పనులు చేసే వారికి మృతదేహం మూట కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. తల్లితండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.