AP News: గుడివాడ నియోజకవర్గానికి చేరుకున్న అమరావతి రైతులు
ABN , First Publish Date - 2022-09-23T22:14:13+05:30 IST
Amaravathi: అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడ నియోజకవర్గానికి చేరుకుంది. గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, రైతులతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. స్థానిక రైతులు ఎడ్లబండ్ల ర్యాలీతో అమరావతి రైతులకు మద్దతు తెలపగా.. స్థానిక మహిళలు పొలాల్లో పూలు తెచ్చి రైతులపై చల్లారు. గుడివాడ నియోజకవర్గ పల్లెలు ఆకుపచ్చ జెండాలు, జై అమరావతి నినాదాలతో మార్మోగింది.
Amaravathi: అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడ నియోజకవర్గానికి చేరుకుంది. గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, రైతులతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. స్థానిక రైతులు ఎడ్లబండ్ల ర్యాలీతో అమరావతి రైతులకు మద్దతు తెలపగా.. స్థానిక మహిళలు పొలాల్లో పూలు తెచ్చి రైతులపై చల్లారు. గుడివాడ నియోజకవర్గ పల్లెలు ఆకుపచ్చ జెండాలు, జై అమరావతి నినాదాలతో మార్మోగింది.