జగన్‌ను బర్త్‌రఫ్‌ చేయాలి: మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌

ABN , First Publish Date - 2022-12-10T02:14:16+05:30 IST

ముస్లిం మైనార్టీలను దగా చేసిన సీఎం జగన్‌ను ఇక ఎంతమాత్రం అధికారంలో కొనసాగించరాదని, వెంటనే ఆయన్ను బర్త్‌రఫ్‌ చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు.

జగన్‌ను బర్త్‌రఫ్‌ చేయాలి: మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌

గుంటూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీలను దగా చేసిన సీఎం జగన్‌ను ఇక ఎంతమాత్రం అధికారంలో కొనసాగించరాదని, వెంటనే ఆయన్ను బర్త్‌రఫ్‌ చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. తాను అధికారంలోకి వస్తే రూ.5 లక్షల రుణం ప్రతి ముస్లిం మైనార్టీకీ ఇస్తానని చెప్పి నేటివరకు ఒక్క రూపాయీ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన ‘బాత్‌చిత్‌ విత్‌ బాబు’ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముస్లింలకు విదేశీ విద్య, దుల్హన్‌, చంద్రన్న రంజాన్‌ తోఫా వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ తమ మనసులను దోచుకొందన్నారు. వాటన్నింటినీ నిలిపేసి జగన్‌ ప్రభుత్వం దోకా ఇచ్చిందన్నారు.

Updated Date - 2022-12-10T02:14:17+05:30 IST