AP News: ఆ బాధ్యతను నాకు అప్పగించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-20T19:39:19+05:30 IST

Vijayawada: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandi) ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విజయవాడకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ..భా

AP News: ఆ బాధ్యతను నాకు అప్పగించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Vijayawada: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandi) ‘భారత్ జోడో యాత్ర’  (Bharat Jodo Yatra) నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విజయవాడకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ..భారత్ జోడో యాత్ర‌ను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర‌ను తానే పర్యవేక్షిస్తానని, ఆ విషయం గురించి మాట్లాడానికే ఏపీ నాయకులతో మాట్లాడటానికి విజయవాడ వచ్చానని పేర్కొన్నారు.


‘‘ దేశ వ్యాప్తంగా రాహుల్ యాత్ర‌కు మంచి స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ (Congress) కూడా ప్రజల్లోకి బలంగా వెళుతుంది. అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందాలని రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారు. ఏపీలో కూడా అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేసేలా కలిసి రావాలి. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అందరూ సర్దుకుని  పనిచేయండి. సమన్వయ లోపం ఉంటే వెంటనే నా దృష్టి కి తీసుకురండి’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-09-20T19:39:19+05:30 IST