Alapati Raja: జగన్ ప్రభుత్వం పతనానికి సమయం దగ్గర పడింది
ABN , First Publish Date - 2022-09-18T16:32:41+05:30 IST
జగన్ రెడ్డి ప్రభుత్వం పతనానికి సమయం దగ్గర పడిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: జగన్ రెడ్డి ప్రభుత్వం (AP government) పతనానికి సమయం దగ్గర పడిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా (Alapati raja) వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (CM Jagan mohan reddy) ఎన్నికల ముందు మహిళల కోసం మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశారని అన్నారు. సొంత వ్యాపారంతో నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని నిషేధించారని తెలిపారు. మద్యపాన విషయంలో సీఎం (YS Jagan) ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం అక్రమ మద్యం అమ్ముతోందని... ఇంత కంటే దారుణం మరొకటి లేదన్నారు. కల్తీ మద్యం తాగి 27మంది చనిపోతే ప్రభుత్వం తప్పు దోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో బారు షాపు రెండు కోట్లు పోయిందంటే మద్యం ద్వారా ఎలా దోచుకుంటారో అర్థం అవుతోందన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు నడిపిస్తున్న విధానం ఏంటని ఆలపాటి రాజా నిలదీశారు.