వైసీపీ స్వార్ధ రాజకీయాలకు అమరావతి బలి

ABN , First Publish Date - 2022-12-10T01:31:12+05:30 IST

వైసీపీ స్వార్థ రాజకీయాల కు అమరావతి రాజ ధాని బల వుతుందని రా జధాని ప్రాంత రైతులు, మ హిళలు ఆవేద న వ్యక్తం చేశా రు.

వైసీపీ స్వార్ధ రాజకీయాలకు అమరావతి బలి
వెంకటపాలెం రైతు ధర్నా శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

తుళ్లూరు, డిసెం బరు 9: వైసీపీ స్వార్థ రాజకీయాల కు అమరావతి రాజ ధాని బల వుతుందని రా జధాని ప్రాంత రైతులు, మ హిళలు ఆవేద న వ్యక్తం చేశా రు. బిల్డ్‌ అమ రావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు, మహిళలు రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం నాటికి 1088వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతుధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని ప్ర జారాజధానిగా అద్భుతంగా నిర్మించి, భావితరాల భవిష్యత్తుకు భరోసానిస్తుందన్న ఆశతో రా జధాని ప్రాంత రైతులు తమ భూములను త్యా గంచేస్తే, వైసీపీ ప్రభుత్వం తన స్వార్ధ రాజకీ యాల కోసం రాజధాని నిర్వీర్యం చేస్తూ ఆ ప్రాంత రైతులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాం తాల, అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తును నాశ నం చేస్తుందని అన్నారు. అమరావతి 13 జిల్లాల అభివృద్ధికి పునాధి అని, వైసీపీ మూడు రాజధానులు కేవలం దోపిడీకి కోసమేనని అన్నారు. ఇప్పటికైనా అమరావతి అభివృద్థిని కొనసాగించి రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-12-10T01:31:16+05:30 IST