MLA హక్కుల్ని సైతం పోలీసులు కాలరాస్తున్నారు: Anagani Satyaprasad

ABN , First Publish Date - 2022-07-18T17:31:09+05:30 IST

ఎమ్మెల్యే హక్కుల్ని సైతం పోలీసులు కాలరాస్తున్నారని అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.

MLA హక్కుల్ని సైతం పోలీసులు కాలరాస్తున్నారు: Anagani Satyaprasad

అమరావతి (Amaravathi): ఎమ్మెల్యే (MLA) హక్కుల్ని సైతం పోలీసులు (police) కాలరాస్తున్నారని రేపల్లె (Repalle) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలపై స్పందించాల్సిన బాధ్యత, అందుకు సర్వహక్కులు తన కున్నాయన్నారు. తనను అడ్డుకున్న పోలీసులపై చట్టపరంగా ముందుకెళ్తున్నామని, వారిపై ప్రయివేటు కేసులు వేస్తామన్నారు. వైకాపా నేతలు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ ఓటమి గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలకు.. జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మిని గెలిపించుకోలేకపోయారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కన్న తల్లినే పార్టీ నుంచి తరిమేశారని విమర్శించారు. రేపల్లె మద్యం మరణాల కుటుంబసభ్యులకు రూ.50 లక్షలు ఇచ్చి తీరాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-18T17:31:09+05:30 IST