Guntur: కోడెల శివరాం పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు
ABN , First Publish Date - 2022-02-19T13:29:52+05:30 IST
జిల్లాలోని సత్తనపల్లి లో కోడెల శివరాం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
గుంటూరు: జిల్లాలోని సత్తనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోడెల నివాసం, టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పేరేచర్ల - కొండమోడు రోడ్డు విస్తరణ పనుల చేపట్టాలని కోడెల పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు చంద్రన్న ఆశయ సాధన పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావుతో పాటు పలువురు పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. దేవరంపాడు కొండ వద్ద భోజన ఏర్పాట్లను కూడా అడ్డుకున్నారు. ప్రస్తుతం కోడెల శివరాం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరతామని కోడెల శివరాం స్పష్టం చేశారు.