Guntur: ఎమ్మెల్యే సుచరిత ముందే గొడవలు
ABN , First Publish Date - 2022-10-03T00:50:08+05:30 IST
వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి సుచరిత ముందే విభేదాలు బయటపడ్డాయి. నడెం పాలెం సచివాలయాల ప్రారంభోత్సవ శిలాఫలకంపై....
గుంటూరు (Guntur): జిల్లా వైసీపీ (Ycp)లో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి సుచరిత (Former Minister Sucharitha) ముందే విభేదాలు బయటపడ్డాయి. నడెం పాలెం సచివాలయాల ప్రారంభోత్సవ శిలాఫలకంపై ప్రోటోకాల్ పాటించడంలేదని.. ఓ వర్గం వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. శిలాఫలకాలపై వైఎస్ ఎంపీపీ పేరు లేకపోవడం, గ్రామ సర్పంచ్ పేరును చివరలో రాయడంపై అభ్యంతరం తెలిపారు. నడెంపాలెం గ్రామంపై గనికపూడి పాత మల్లయ్యపాలెం నాయకుల పెత్తనం ఏంటని సుచరిత ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు.