Polavaram గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-07-08T02:38:33+05:30 IST
పోలవరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు
పోలవరం: పోలవరం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో 48 రేడియల్ గేట్లను జలవనరుల శాఖ అధికారులు ఎత్తివేసి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 27.135 మీటర్ల నీటిమట్టం దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 15.555 మీటర్ల నీటిమట్టం నమోదయ్యింది. పోలవరం ప్రాజెక్టు ఎగువన 25.88 టిఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు ఈఈ ఆదిరెడ్డి తెలిపారు.