AP NEWS : లోన్ యాప్ వేధింపుల కేసులో మరో నలుగురు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-26T01:25:48+05:30 IST

లోన్ యాప్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రమ్య లక్ష్మి దంపతుల కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి తెలిపారు.

AP NEWS : లోన్ యాప్ వేధింపుల కేసులో మరో నలుగురు నిందితుల అరెస్ట్

రాజమండ్రి: లోన్ యాప్(Loan app) వేధింపుల(Harassment) వల్ల ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతుల కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి(SP Sudhir Kumar Reddy) తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు హాండీ, స్పీడ్ లోన్ యాప్‌ల ద్వారా లోన్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు గుజరాత్ నుంచి లావాదేవీలు జరుపుతున్నట్టు విచారణలో తెలింది. బాధితుల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును లోన్‌యాప్‌ల ఓనర్స్ షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో పంచుకుంటున్నారని ఎస్సీ తెలిపారు. నిందితుల కోసం తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ సుధీర్ కుమార్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2022-09-26T01:25:48+05:30 IST