‘పది’ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2022-12-10T02:36:52+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది.
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 11 చివరి తేదీ కాగా.. దానిని 20వ తేదీ వరకు పెంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 26 వరకు రూ.50, 27 నుంచి జనవరి 2 వరకు రూ.200, 3 నుంచి 9 వరకు రూ.500 అపరాధ రుసుముతో కలిపి చెల్లించవచ్చని వివరించారు.