మురుగునీటి పారుదల వ్యవస్థ పటిష్టానికి కృషి
ABN , First Publish Date - 2022-11-30T01:07:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ నుంచి నల్లా ఛానల్ వరకూ రూ.238 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు తుమ్మలావ అంబేడ్కర్ భవనం వద్ద మంత్రి రోజా, ఎంపీ భరత్రామ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.
రూ.238 లక్షల పనులకు మంత్రి రోజా శంకుస్థాపన
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ నుంచి నల్లా ఛానల్ వరకూ రూ.238 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు తుమ్మలావ అంబేడ్కర్ భవనం వద్ద మంత్రి రోజా, ఎంపీ భరత్రామ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తుమ్మలోవ ముంపు నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. 770 మీటర్ల పొడవు, 1.50 మీటర్ల వెడల్పు, ఎత్తుతో కూడిన స్టార్మ్ వాటర్ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. వచ్చే ఆరు, ఏడు నెలల్లోనే పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రుడా ఛైర్పర్సన్ షర్మిళారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్కుమార్, ఎస్ఈ పాండురంగారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.