‘అశాంతి, అలజడికి కేంద్రంగా కాకినాడ’
ABN , First Publish Date - 2022-05-30T06:00:16+05:30 IST
భానుగుడి (కాకినాడ), మే 29: కాకినాడ శాంతికి ప్రతీకగా పెన్షనర్ ప్యారడైజ్గా కొనియాడే రోజులు పోయి అశాం తి, అలజడికి కేంద్రంగా మారిందని వెల్ఫే
భానుగుడి (కాకినాడ), మే 29: కాకినాడ శాంతికి ప్రతీకగా పెన్షనర్ ప్యారడైజ్గా కొనియాడే రోజులు పోయి అశాం తి, అలజడికి కేంద్రంగా మారిందని వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసన్షరీఫ్ అన్నారు. కాకినాడలో కొంతకాలంగా జరుగుతున్న హత్యలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డ్రగ్స్కు, గంజాయికి యువత బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.