AP News: కాకినాడలో రెండు బోట్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-11-24T09:23:41+05:30 IST

జిల్లాలోని ఏటిమొగలో రెండు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

AP News:  కాకినాడలో రెండు బోట్లు దగ్ధం

కాకినాడ: జిల్లాలోని ఏటిమొగలో రెండు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏటిమొగ కాలువ ద్వారా సముద్రానికి వెళ్ళే దారిలో లంగరు వేసి ఉన్న రెండు బోట్లకు ఒక్కసారిగా మంటలు వ్యాపించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కాగా.. బోట్ల వద్దకు వెళ్లే దారి లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది మరో బోటులో వెళ్లి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.11లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-11-24T09:23:42+05:30 IST