పోలీసు కస్టడీకి హత్యాయత్నం కేసు నిందితుడు
ABN , First Publish Date - 2022-11-30T01:02:58+05:30 IST
టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు తుని పట్టణ సీఐ నాగదుర్గారావు మంగళవారం తెలిపారు. కేసు విచారణాధికారి పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ మురళీమోహన్ నృతృత్వంలో నిందితుడిని విచారించేందుకు మూడురోజులపాటు కస్టడీలోకి కోర్టు నుంచి అనుమతి పొందారన్నారు.
మూడురోజులపాటు కోర్టు అనుమతి
తుని, నవంబరు 29: టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టు తుని పట్టణ సీఐ నాగదుర్గారావు మంగళవారం తెలిపారు. కేసు విచారణాధికారి పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ మురళీమోహన్ నృతృత్వంలో నిందితుడిని విచారించేందుకు మూడురోజులపాటు కస్టడీలోకి కోర్టు నుంచి అనుమతి పొందారన్నారు. దీంతో శేషగిరిరావుపై హత్యాయత్నం చేసేందుకు గల పూర్తి కారణాలు, ఆ రోజున ఎంతమంది వచ్చారన్న దానిపై సమగ్రంగా విచారిస్తారన్నారు. నిందితుడు చెప్పిన అతడి గురువు కప్పా అభిరామ్ ఇంకా దొరకలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.