టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-24T06:57:32+05:30 IST
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం ప్రారంభించారు.
మండపేట, ఏప్రిల్ 23: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. స్థానిక టౌన్హాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాలరాంబాబు, ముత్యాల అంబరిష్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.