రాష్ట్రంలోనే మోడల్‌ విలేజ్‌గా జేగురుపాడు

ABN , First Publish Date - 2022-09-08T06:50:14+05:30 IST

రాష్ట్రంలోనే మోడల్‌ విలేజ్‌గా కడియం మండలం జేగురుపాడు పంచాయతీ నిలుస్తుందని అందుకు సర్పంచ్‌ యాదల స్టాలిన్‌ కృషి అభినందనీయం అని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు అన్నారు.

రాష్ట్రంలోనే మోడల్‌ విలేజ్‌గా జేగురుపాడు

కడియం, సెప్టెంబరు 7: రాష్ట్రంలోనే మోడల్‌ విలేజ్‌గా కడియం మండలం జేగురుపాడు పంచాయతీ నిలుస్తుందని అందుకు సర్పంచ్‌ యాదల స్టాలిన్‌ కృషి అభినందనీయం అని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు అన్నారు. జేగురుపాడులో రూ.1.50 కోట్లతో నిర్మితమైన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, సీనియర్‌ సిటిజెన్‌ రెస్ట్‌హౌస్‌, భోజనశాల, పార్కులను బుధవారం ప్రారంభించారు. అలానే సచివాలయ భవనం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరె డ్డి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ యాదల స్టాలిన్‌, దేవదీవెనకుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, నాయకులు దొంతంశెట్టి భద్రయ్య, ఈలి గోపాలం, వారా రాము, ఆకుల సుధాకర్‌, జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు, డీపీవో జగదాంబ, డ్వామా పీడీ రామ్‌గోపాల్‌, పీఆర్‌ ఈఈ ప్రసాద్‌, ఎంపీడీవో కె రత్నకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-08T06:50:14+05:30 IST