సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్
ABN , First Publish Date - 2022-11-12T00:47:30+05:30 IST
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వ రూప్, బేబీ మీనాక్షి దంపతులు శుక్రవారం అయినవిల్లి సిద్ధి వినా యకు డిని దర్శించుకున్నారు. తొలుత దేవస్థానం చైర్మన్ నంబూరి వెంకటరమణ రాజు, ఈవో ముదునూరి
అయినవిల్లి, నవంబరు 11: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వ రూప్, బేబీ మీనాక్షి దంపతులు శుక్రవారం అయినవిల్లి సిద్ధి వినా యకు డిని దర్శించుకున్నారు. తొలుత దేవస్థానం చైర్మన్ నంబూరి వెంకటరమణ రాజు, ఈవో ముదునూరి సత్యనారా యణరాజు, ధర్మకర్తల ఆధ్వర్యంలో మంత్రి విశ్వరూప్ దంపతులకు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సిద్ధివినాయకునికి విశేషపూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. చైర్మన్ వెంకట రమణరాజు ఆధ్వర్యంలో మంత్రిని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట పి.గన్న వరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జడ్పీటీసీలు గన్నవరపు శ్రీనివాస్, పందిరి శ్రీహరి, పి.శ్రీను పాల్గొన్నారు.
శాల డీన్ డాక్టర్ ఆనం