‘కార్యదర్శి భవానీది ప్రభుత్వ హత్యే’

ABN , First Publish Date - 2022-09-11T06:43:18+05:30 IST

చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.

‘కార్యదర్శి భవానీది ప్రభుత్వ హత్యే’

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 10: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. భవానీది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో బహు జన సమాజ్‌పార్టీ, వీసీకే, షెడ్యూల్లుకులాల సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొ న్నారు. దీక్షలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల నరసింహమూర్తి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, షెడ్యూల్లు కులాల సంక్షేమసంఘ అధ్యక్షుడు బత్తుల నకులరాజు, వివిధ సంఘాల నాయకులు కోలా త్రిమూర్తులు, జిత్తుక సత్యనారాయణ, జంగా కృష్ణమూర్తి, కాశి లక్ష్మీ భవానీ, భారతి వాసు, బొంతు రమణ, రేవు తిరుపతిరావు, పినిపే రాధాకృష్ణ, పరమట అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-11T06:43:18+05:30 IST