అధ్వానంగా వీధిలైట్ల నిర్వహణ
ABN , First Publish Date - 2022-11-30T23:34:35+05:30 IST
వీధిలైట్ల నిర్వహ ణ అధ్వానంగా ఉందని, నెలల తరబడి దీపాలు వెలగకుండా వీధులు అంధకారంలో ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్హాలులో బుధవారం జరిగిన కౌ
పిఠాపురం కౌన్సిల్ సభ్యుల ఆగ్రహం
పిఠాపురం, నవంబరు 30: వీధిలైట్ల నిర్వహ ణ అధ్వానంగా ఉందని, నెలల తరబడి దీపాలు వెలగకుండా వీధులు అంధకారంలో ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్హాలులో బుధవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షత వహించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధానమయిన ఉప్పాడ సెంటర్ నుంచి గల డివైడర్పై లైట్లు వెలగడం లేదని ఫిర్యాదుచేస్తున్నా ఫలితం లేకపోయిందన్నారు. కౌన్సిలర్లు పెదపాటి రాజేష్, బోను దేవ, వైస్చైర్మన్ పచ్చిమళ్ల జ్యోతి మాట్లాడుతూ వీధిదీపాల నిర్వహణకు పనిచేస్తున్న సిబ్బందికి 4నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. డీఈఈ భవానీశంకర్ మాట్లాడుతూ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, వీధిలైట్లకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలో పందుల సమస్యకు ఇంతవరకూ పరిష్కారం ఎందుకు చూపలేకపోయారని తలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుళాయిలు, పైపులైన్లకు లీకేజీలు ఉంటున్నాయని, కనెక్షన్లు వేసిన తర్వాత గోతులు పూడ్చడం లేదని సోమరౌతు లలితాదేవి తెలిపారు. పంపనబోయిన అన్నపూర్ణ, ముమ్మిడి రత్నసుజిత తదితరులున్నారు.