‘శాస్త్రవేత్తల సూచనలను రైతులు పాటించాలి’
ABN , First Publish Date - 2022-12-12T23:57:22+05:30 IST
తుఫాను కారణంగా నేలవాలిన, కోత కోసినవరి పనలు గింజలు మొలకెత్తడం, రంగుమారడం వంటి విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సూచనలను రైతులు తప్పక పాటించాలని ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా నరసింహారావు సూచించారు. పనలపై కంకు
పెద్దాపురం, డిసెంబరు 12: తుఫాను కారణంగా నేలవాలిన, కోత కోసినవరి పనలు గింజలు మొలకెత్తడం, రంగుమారడం వంటి విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సూచనలను రైతులు తప్పక పాటించాలని ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా నరసింహారావు సూచించారు. పనలపై కంకుల మీద పడేటట్టు ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలన్నారు. అలాగే వరిపైరు నూర్చే సమయంలో కళ్లాల్లో ధాన్యం తడిసినట్లయితే ఎండబెట్టడానికి వీలుకాని పక్షంలో ఉప్పు కలిపి ధాన్యాన్ని పోగుపెట్టానట్లయితే ధాన్యం పాడవకుండా నిల్వ చేసుకోవచ్చని సూచన చేశారు. రైతులు తమ సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాలన్నారు.