రసాయనశాస్త్రానికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-11-19T00:53:30+05:30 IST
ప్రాచీన కాలంలో రసాయశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉందని కళాశాల విద్య ఆర్జేడీ సీ.కృష్ణ అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 18 : ప్రాచీన కాలంలో రసాయశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉందని కళాశాల విద్య ఆర్జేడీ సీ.కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే సదస్సును శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.ఏయూ రసాయనశాస్త్ర విభాగాధిపతి, సీసీఈ-ఏపీ ప్రొఫెసర్ పి.శ్యామల నిత్య జీవితంలో లిథియం అయాన్ బ్యాటరీల వినియోగం, డిస్రప్టివ్ టెక్నాలజీపై వివరించారు. ఐవోసీ భువనేశ్వర్కు చెందిన శాస్త్రవేత్త దండేల రాంబాబు ఔషధ అణువుల రూపకల్పన, అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితిని వివిరించారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీశైల శాస్త్రి, ఐఐఎస్ఈఆర్ బెర్హంపూర్ సహాయ అధ్యాపకుడు తిరుపతి బూర్ల, ఐఐపీ వైజాగ్ సైంటిస్ట్ సీహెచ్ గుప్త, కళాశాల రసాయనశాస్త్ర విభాగాధిపతి జాకబ్, ఇతర అఽధ్యాపకులు పాల్గొన్నారు.