వరద ముంపులోనే లంక గ్రామాలు
ABN , First Publish Date - 2022-07-18T07:14:16+05:30 IST
వాడపాలెం శివారు నారాయణలంక, సత్తెమ్మలం కగ్రామాలు జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఆదివారం డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎం.నూకరాజు, ఎంపీడీ వో ఇ.మహేశ్వరరావు వరద పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం ద్వారా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కొత్తపేట: వాడపాలెం శివారు నారాయణలంక, సత్తెమ్మలం కగ్రామాలు జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఆదివారం డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎం.నూకరాజు, ఎంపీడీ వో ఇ.మహేశ్వరరావు వరద పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం ద్వారా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ర్యాలికి చెందిన శ్యామ్జాదూగర్ మేజిక్ఫ్యామిలీ ఆధ్వర్యంలో నారాయణలంక వాసులకు సీజనల్ వ్యాధులు రాకుండా హోమియోమందులు, ఎనర్జీడ్రింక్స్, బిస్కెట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసైనికులు నారాయణలంక వెళ్లి ముంపు బాధి ్డతులను పరామర్శించి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. నారాయణలంక, సత్తెమ్మలంక వరద ముంపుతో కూరగాయల పం టలు, అరటి, కంద వంటి పంటలు ముంపులోనే ఉండిపోవ డంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.