శిథిలావస్థలో కపిలేశ్వరపురం లాకులు

ABN , First Publish Date - 2022-09-08T06:44:13+05:30 IST

కపిలేశ్వరపురంలో 1942లో బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరుకు న్నాయి.

శిథిలావస్థలో కపిలేశ్వరపురం లాకులు

 బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన లాకులు అధ్వానం

 పట్టించుకోని అధికారులు  వృథాగా పోతున్న సాగునీరు ఫ పాడైన సిబ్బంది క్వార్టర్స్‌   

కపిలేశ్వరపురం, సెప్టెంబరు 7: కపిలేశ్వరపురంలో 1942లో బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరుకు న్నాయి. సాగునీటి ప్రవాహాన్ని కట్టడిచేసి మెరక ప్రాంతాలకు నీరందించేందుకు లాకులు నిర్మించారు. 36,388ఎకరాల ఆయ కట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించిన లాకులు నిర్వ హణ సక్రమంగా లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యా యి. అయితే లాకుల తలుపులకు రంధ్రాలుపడి లీకేజీలతో నీరు వృథాగాపోతుంది.  అయితే వాటిని అధికారులు పట్టిం చుకున్న దాఖలాలులేవు. ప్రస్తుతం ఎగువ,దిగువ లాకులు మూతబడి, తెరుచుకునే కంట్రోల్‌ సిస్టం సక్రమంగా పని చేయడంలేదు. గతంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పుడు ఈలాకులకు మరమ్మతులుచేసి కొత్త తలుపులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో సాగునీరు వృథాగా పోతుంది.  ఇక్కడ పనిచేసే సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. సిబ్బంది నివసించేందుకు నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు  చేరడంతో నివాసయోగ్యంగా లేవు. దీంతో సిబ్బంది బయట ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. ఈప్రాంతం విషసర్పాలకు నిలయంగా మారడంతో సిబ్బంది భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణం  స్పందించి లాకులకు మరమ్మతులు చేపట్టి, కొత్తగా క్వార్టర్లు నిర్మించాలని రైతులు, మండల ప్రజలు కోరుతున్నారు.లాకులు



Updated Date - 2022-09-08T06:44:13+05:30 IST