నన్నయలో హాస్టల్ విద్యార్థుల ధర్నా
ABN , First Publish Date - 2022-07-05T07:14:58+05:30 IST
న్యాయబద్ధమైన తమ డిమాండ్లను సత్వరం పరిష్కరించా లని కోరుతు ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యంలోని హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు.
దివాన్చెరువు, జూలై 4: న్యాయబద్ధమైన తమ డిమాండ్లను సత్వరం పరిష్కరించా లని కోరుతు ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యంలోని హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. వర్శిటీలోని కేంద్ర పరిపాలనా భవనం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ నన్నయ యూనివర్శిటీ ప్రధాన కార్యదర్శి డి.అశోక్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి వర్శిటీ వసూలు చేసిన బిల్డింగ్ ఫండ్లో రూ.వెయ్యి వంతున మినహాయించుకుని పీజీ, బీఈడీ, ఎంపీఈడీ విద్యార్థులకు రూ.8 వేలు, బీటెక్ విద్యార్థులకు రూ.10 వేలు వంతున వెనుకకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రధాన ద్వారం 24 గంటలూ తెరిచి ఉంచాలని, బాలికల వసతి గృహంలో ప్రస్తుతం వంట చేస్తున్న హెల్పర్లు స్థానంలో కుక్ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లను వర్శిటీ అధికారులు స్పందించి వెంటనే పరిష్క రించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్.ఆదర్శ, కేశవ, వెంకట్, ప్రవల్లిక పాల్గొన్నారు.