మూలగపూడిలో రామాలయం పునర్నిర్మాణానికి రూ.20లక్షల మంజూరు
ABN , First Publish Date - 2022-04-10T06:59:43+05:30 IST
రౌతులపూడి మండలం మూలగపూడిలో పూరాతన రామాలయం దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆ ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు దేవదాయ డిప్యూటీ కమిషనర్ ఎమ్.విజయ్రాజు తెలిపారు.
రౌతులపూడి, ఏప్రిల్ 9: రౌతులపూడి మండలం మూలగపూడిలో పూరాతన రామాలయం దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆ ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు దేవదాయ డిప్యూటీ కమిషనర్ ఎమ్.విజయ్రాజు తెలిపారు. ‘చరిత్ర ఘనం.. అభివృద్ధి శూన్యం’ శీర్షికిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించి శనివారం ఆలయాన్ని పరిశీలించారు. గ్రామస్తులనుంచి వివరాలు సేకరించారు. దీన్ని 14వ శతాబ్ధం నాటిదిగా గుర్తించారు. ఈ ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. రౌతులపూడిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ ఫణికుమార్, సర్పంచ్ తమరాల సత్యనారాయణ, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, పైల వేణుగోపాల్, వాసిరెడ్డి భాస్కరావు, అడిగర్ల రామకృష్ణ ఉన్నారు.