భీమేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-08-31T07:00:09+05:30 IST
పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు.
ద్రాక్షారామ, ఆగస్టు 30: పంచారామక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీసుధా కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం న్యాయమూర్తి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను న్యాయమూర్తి దంపతులకు అందజేశారు.