సార్వా సాగు చేయలేమన్న గోపవరం రైతులు
ABN , First Publish Date - 2022-06-11T06:29:27+05:30 IST
పూడుకుపోయిన డ్రెయిన్లు, నెలల తరబడి చేతికి అందని ధాన్యం సొమ్ములు, సాగు సమయంలో ఉపాఽధి పనుల వంటి పలు సమస్యల సుడిగుండంలో సార్వా సాగు చెయ్యలేమంటూ గోపవరం రైతులు శుక్రవారం తహశీల్దార్ జి.ఝాన్సీ, వ్యవసాయాఽధికారిణి వై.శోభకు వినతిపత్రాలు సమర్పించారు.
ఉప్పలగుప్తం, జూన్ 10: పూడుకుపోయిన డ్రెయిన్లు, నెలల తరబడి చేతికి అందని ధాన్యం సొమ్ములు, సాగు సమయంలో ఉపాఽధి పనుల వంటి పలు సమస్యల సుడిగుండంలో సార్వా సాగు చెయ్యలేమంటూ గోపవరం రైతులు శుక్రవారం తహశీల్దార్ జి.ఝాన్సీ, వ్యవసాయాఽధికారిణి వై.శోభకు వినతిపత్రాలు సమర్పించారు. ధాన్యానికి లాభసాటి ధర, రైతుకు ఆదాయ భద్రత కల్పిస్తామన్న భరోసా ప్రభుత్వం ఇస్తే సాగు సాధ్యమవుతుందని రైతులు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, బండారు నందికేశ్వరరావు, చింతపల్లి నాగేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, ములపర్తి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.