సామాన్యుడి చేతిలో రాజ్యాంగం
ABN , First Publish Date - 2022-11-28T01:00:21+05:30 IST
యానాం సీనియర్ పాత్రికేయులు కళైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకం సామాన్యుడి చేతితో రాజ్యాంగమని ప్రముఖ రచియిత దాట్ల దేవదానం రాజు అన్నారు.
యానాం, నవంబరు 27: యానాం సీనియర్ పాత్రికేయులు కళైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకం సామాన్యుడి చేతితో రాజ్యాంగమని ప్రముఖ రచియిత దాట్ల దేవదానం రాజు అన్నారు. విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో యానాం బుద్ధాపార్క్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దాసరి అప్పారావు అధ్యక్షతన జరిగిన సత్కార సభలో కవి దేవదానంరాజు మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ను తెలుగులో అనువాదం చేసి సామాన్యుడి చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని అందించిన చరిత్రాత్ముకుడు విష్ణుమూర్తి అన్నారు. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్, కవులు, న్యాయవాదులు వడ్డి నాగేశ్వరరావు, కాశి జానకి రాముడు, పుల్లపు వెంకట్రావు, తిరుకోటి నాగేశ్వరరావు, యానాం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షడు చెల్లి గోపినాథ్, పాము సత్యనారాయణ, వెంటపల్లి వెంకట్రావు, సుబ్బలక్ష్మి తదితరులు విష్ణుమూర్తిని సత్కరించారు.