అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2022-06-11T06:31:22+05:30 IST
సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.
రామచంద్రపురం, జూన్ 10: సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 11వ సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న లబ్ధిని స్వయంగా చదివి వినిపించారు. అనంతరం వారికి సంబందిత పత్రా లను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవి, పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, కోఆప్షన్ మెంబర్ గుబ్బల గణపతిరావు, పాల్గొన్నారు.