నిరుద్యోగులను వంచించిన మోదీ
ABN , First Publish Date - 2022-09-19T09:59:21+05:30 IST
దేశవ్యాప్తంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని డీవైఎ్ఫఐ అఖిల భారత కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య విమర్శించారు. కర్నూల్లో జరుగుతున్న డీవైఎ్ఫఐ 15వ రాష్ట్ర
డీవైఎ్ఫఐ కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య
కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 18: దేశవ్యాప్తంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని డీవైఎ్ఫఐ అఖిల భారత కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య విమర్శించారు. కర్నూల్లో జరుగుతున్న డీవైఎ్ఫఐ 15వ రాష్ట్ర మహాసభల రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. డీవైఎ్ఫఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 3న ‘నా ఉద్యోగం ఎక్కడ?’ అనే నినాదంతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 32 లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.