డీజీపీ హాజరుకావాలి: హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-09-28T23:37:27+05:30 IST

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (AP DGP Rajendranath Reddy) హాజరుకావాలని హైకోర్టు (High Court) ఆదేశించింది.

డీజీపీ హాజరుకావాలి: హైకోర్టు ఆదేశం

అమరావతి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (AP DGP Rajendranath Reddy) హాజరుకావాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. రేషన్‌ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా (Kurnool District) కల్లూరుకి చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. నిబంధనలకు వ్యతిరేకంగా రైస్ మిల్లులోని 5 వాహనాలను సీజ్ చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. అక్రమాలు జరిగితే చట్టం, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేకసార్లు డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ తరపు కోర్టు దృష్టికి తెచ్చారు. అధికారులు ఎందుకు పాటించడం లేదో వివరణ ఇవ్వాలని, వివరణ కోసం డీజీపీ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-09-28T23:37:27+05:30 IST