Tammineni Sitharam : డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-09-16T16:07:44+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly session) రెండో రోజు నేడు ప్రారంభమయ్యాయి.

Tammineni Sitharam : డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై కీలక ప్రకటన

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly session) రెండో రోజు నేడు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం (Tammineni sitaram) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు (TDP Leaders) ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చారని... కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రాన్ని ప్రభుత్వం ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Atchennaidu) అన్నారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitharam) డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై కీలక ప్రకటన చేశారు. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక(Deputy speaker election) నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఆదిరెడ్డి భవాని(Adireddy Bhavani) ఇచ్చిన వాయిదా తీర్మానంపై తరువాత నిర్ణయం చెపుతామని తమ్మినేని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-16T16:07:44+05:30 IST