అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2022-11-29T09:23:15+05:30 IST

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి

Vijayawada : డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బందరు మండలం గోకవరం గ్రామానికి చెందిన కోవెల నాగమణి లక్ష్మి (19) మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. తండ్రి పాండురంగారావు ఆటో నడుపుతుంటాడు. తల్లి శివలక్ష్మి ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఉంటుంది. రెండు రోజుల క్రితం శివలక్ష్మి పుట్టింటికి వెళ్లగా.. పాండురంగారావు పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో తండ్రి ఇంటికి వచ్చి చూడగా నాగమణి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో సమాచారం అందుకుని పోలీసులు గ్రామానికి తిరిగి చేరుకున్నారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అనుమానాస్పద మృతిగా ఎస్ఐ చాణక్య కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - 2022-11-29T09:23:17+05:30 IST