దళితులు స్వీయరక్షణకు ఏకమవ్వాలి: జవహర్
ABN , First Publish Date - 2022-07-07T08:46:59+05:30 IST
దళితులు స్వీయరక్షణకు ఏకమవ్వాలి: జవహర్
రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్ను సంతృప్తి పరిచే పనిలో ఉన్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఆదేశాలను సైతం రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్ పాలనలో దళితుల మానప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నమ్ముకునే బదులు స్వీయ రక్షణకు దళితులు ఏకమవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.