Ramakrishna: అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ముందా బొత్స
ABN , First Publish Date - 2022-09-27T14:07:59+05:30 IST
అమరావతి రైతుల పాదయాత్ర గురించి మంత్రి బొత్స వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర (Amravati farmers padayatra) గురించి మంత్రి బొత్స (Botsa satyanarayana) వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటతప్పి - మడమతిప్పే మీలాంటి మోసగాళ్లకు అమరావతి రైతుల త్యాగాలు కనబడవన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ఆపే దమ్ముందా బొత్స (AP Minister) అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అమరావతికి వ్యతిరేకం కాబట్టే పదేపదే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారన్నారు. విశాఖను ముంబైలా చేస్తామనడం ‘‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’’గా ఉందని రామకృష్ణ యెద్దేవా చేశారు.