CPI Narayana: అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దాం
ABN , First Publish Date - 2022-10-11T20:50:56+05:30 IST
అమరావతి రైతుల పోరాటంలో ఏ రాజకీయ పార్టీవారు లేరని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి: అమరావతి రైతుల పోరాటంలో ఏ రాజకీయ పార్టీవారు లేరని సీపీఐ నేత నారాయణ (Narayana) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం రైతులే పాదయాత్ర చేస్తున్నారన్నారు. రైతుల యాత్రపై సీఎం ఆదేశాలతోనే మంత్రులు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే (AP Government) సివిల్ వార్ సృష్టించి అరాచకం చేయాలని చూస్తోందని ఆరోపించారు. జగన్ (CM Jagan) మేనిఫెస్టోలో మూడు రాజధానులని ఎక్కడా అనలేదని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒకరిద్దరు రాజీనామా చేయడం కాదని... అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని నారాయణ (CPI Leader) సవాల్ విసిరారు.