CPI leader: కేంద్ర రాష్ట్రాల హక్కులను హరిస్తోంది
ABN , First Publish Date - 2022-10-12T17:31:51+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీపీఐ నేత డి.రాజా అన్నారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీపీఐ నేత డి.రాజా (D.Raja) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దేశంలో బడుగుబలహీన వర్గాల ప్రజలే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై బీజేపీ (BJP)ని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపడమే జాతీయ సమావేశాల ఎజెండా అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ (BRS) విధివిధానాలను పరిశీలిస్తామని డి.రాజా (CPI Leader) పేర్కొన్నారు.