విత్తన పరిశోధన ప్రాజెక్టు అమలుకు కమిటీ

ABN , First Publish Date - 2022-10-11T09:47:37+05:30 IST

విత్తన పరిశోధన ప్రాజెక్టు అమలుకు కమిటీ

విత్తన పరిశోధన ప్రాజెక్టు అమలుకు కమిటీ


అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు చేసే డాక్టర్‌ వైఎస్సార్‌ సీడ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వారాణసిలోని జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం తరహాలో ఈ ప్రాజెక్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సమీక్షించి, అమలు చేసే సమయంలో ఎప్పటికప్పుడు తగిన సిఫారసులు అందించేందుకు ఏపీ సీడ్స్‌ ఎండీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. సోమవారం గెజిట్‌ విడుదలైంది. 

Updated Date - 2022-10-11T09:47:37+05:30 IST