AP: ఆ పేరు చెబితే గజగజా వణుకుతున్న ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-07-18T21:58:38+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు.

AP: ఆ పేరు చెబితే గజగజా వణుకుతున్న ఎమ్మెల్యేలు

అమరావతి (Amaravathi): గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 8న గడప గడపకు సమీక్షలో ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నారు. పరిస్థితి మెరుగు పర్చుకుని గ్రాఫ్ (Graph) పెంచుకోకపోతే మార్పు తప్పదని వార్నింగ్ (Warning) కూడా ఇచ్చారు. దీంతో ఈసారి ఎవరి గ్రాఫ్ ఏంటో అని ఆందోళనలో ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. ప్రత్యర్థులు, విపక్షనేతల ఇళ్లకు కూడా వెళ్లి.. గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించనున్నారు. అయితే గడప గడపకు వెళ్తే ప్రజలు తిట్ల దండకం అందుకుంటుండడంతో.. ఆ పేరు చెబితే ఎమ్మెల్యేలు గజగజా వణుకుతున్నారు. 

Updated Date - 2022-07-18T21:58:38+05:30 IST