Jagan Delhi Tour.. ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2022-08-21T17:51:45+05:30 IST
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. 7 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని 1 జన్పథ్ నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అవుతారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupati Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad)లను మర్యాద పూర్వకంగా కలుస్తారు.