26న జగన్ విశాఖకు రావడానికి కారణం ఇదే: అమర్నాథ్
ABN , First Publish Date - 2022-08-23T21:33:36+05:30 IST
26న జగన్ విశాఖకు రావడానికి కారణం ఇదే: అమర్నాథ్
విశాఖ: ఈనెల 26న సీఎం విశాఖపట్నం వస్తున్నారని, సముద్రములో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, మళ్లీ ఉపయోగించే అంశంపై పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ నెల 26 న25 వేల మందితో 39 లోకేషన్స్లో సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ను సేకరిస్తామన్నారు. సముద్రంలో సేకరించిన వ్యర్ధాలను అడిడాస్ షూస్ తయారీలో ఉపయోగిస్తారని చెప్పారు. అదే రోజున మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన 9200 మందికి సీఎం చేతుల మీదగా సర్టిఫికెట్లు అందించనున్నారని తెలిపారు.