తుఫాన్ నష్టాల గణన ప్రారంభించాం
ABN , First Publish Date - 2022-12-12T23:49:37+05:30 IST
మాండస్ తుఫానుతో జరిగిన పంట, ఆస్తినష్ట గణన ప్రక్రియ ప్రారంభించామని కలెక్టర్ హరినారాయణన్ వివరించారు.
వీడియో కాన్ఫరెన్సులో సీఎంకు వివరించిన కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 12: మాండస్ తుఫానుతో జరిగిన పంట, ఆస్తినష్ట గణన ప్రక్రియ ప్రారంభించామని కలెక్టర్ హరినారాయణన్ వివరించారు. సోమవారం మధ్యాహ్నం తుఫాన్, భారీ వర్షాలపై అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు నుంచి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక అంచనాల ప్రకారం.. 338.4 హెక్టార్ల పంటనష్టం జరిగిందని పేర్కొన్నారు. పంటలు దెబ్బతిన్నచోట్ల మళ్లీ రైతులు పంటలు వేసుకునేందుకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రిషాంత్రెడ్డి, జేసీ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.