వీఆర్వో సంఘ ఎన్నికలు ఏకగ్రీవం
ABN , First Publish Date - 2022-12-30T00:31:12+05:30 IST
జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సంఘ సర్వసభ్య సమావేశం గురువారం స్థానిక రెవెన్యూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎ. బాలాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా సంఘంలో ఏర్పడిన ఖాళీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 29: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సంఘ సర్వసభ్య సమావేశం గురువారం స్థానిక రెవెన్యూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎ. బాలాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా సంఘంలో ఏర్పడిన ఖాళీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్.పద్మనాభం, ఉపాధ్యక్షుడిగా కె.సుబ్రహ్మణ్యం ఆచ్చారి, సంయుక్త కార్యదర్శులుగా కె.ఎం.భాస్కర్, ఎం.శరత్కుమార్, సులేమాన్, రాజేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జి.దొరస్వామి, కె.పి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అశోక్ రెడ్డి, కృపానందం, పద్మావతి, చిత్తూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా జి.రాజశేఖర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ ఈసీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.నాగరాజు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. బాలాజి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో వీఆర్వోలు పాలుపంచుకోవాలని కోరారు. విజేతలను సన్మానించారు.