బ్రహ్మశ్రీ ఆశ్రమంలో వరుణ్గాంధీ
ABN , First Publish Date - 2022-09-30T07:27:42+05:30 IST
రామాపురం బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని ఎంపీ వరుణ్గాంధీ గురువారం సందర్శించారు.
రామచంద్రాపురం, సెప్టెంబరు 29: రామాపురం బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని ఎంపీ వరుణ్గాంధీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని గాయత్రీమాతను దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి గురువానంద గురూజీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం స్వీకరించారు. గురూజీతో కాసేపు ఏకాంతంగా గడపడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వరుణ్గాంధీని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు.