కొండెక్కిన కరెంట్‌ బస్సులు

ABN , First Publish Date - 2022-10-01T07:38:25+05:30 IST

ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులు తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి.

కొండెక్కిన కరెంట్‌ బస్సులు
తిరుమల బాలాజీ బస్టాండు ప్రాంగణంలో మూడు కరెంట్‌ బస్సులు - బస్సులో భక్తులు

తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 30: ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులు తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో మొత్తానికి మూడు బస్సులకు స్టేజ్‌ క్యారేజ్‌ కింద తాత్కాలిక అనుమతులు పొందారు. దాంతో వీటిని శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద వరుస క్రమంలో పెట్టి.. భక్తులను ఎక్కించారు. మూడు బస్సులూ ఒకేసారి బయల్దేరి.. దాదాపు గంట వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నాయి. కొండపైన బాలాజీ బస్టాండులో తిరిగి భక్తులను ఎక్కించుకుని తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి. ఇలా రాత్రి వరకు మూడు ట్రిప్పులు తిప్పారు. రద్దీ తక్కువగా ఉన్నా ఆక్యుపెన్సీ రేషియో దాదాపు 95శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం మిగిలిన ఏడు బస్సులకూ అనుమతి లభిస్తే భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-10-01T07:38:25+05:30 IST