నులిపురుగుల నివారణ దినంపై వాల్పోస్టర్ల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-09-21T06:23:48+05:30 IST
జాతీయ నులి పురుగుల నివారణ దినంపై వాల్పోస్టర్లను మంగళవారం కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు.
తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 20: జాతీయ నులి పురుగుల నివారణ దినంపై వాల్పోస్టర్లను మంగళవారం కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెట్విన్ సీఈవో, డీఎంహెచ్వో శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. బుధవారం నుంచి జరగనున్న ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పంట వచ్చేలోపే గోదాముల నిర్మాణాలు పూర్తిచేయాలి
పంట చేతికొచ్చేలోపే గోదాముల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశాన్ని జేసీ బాలాజీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డీసీసీబీ, నాబార్డు సహకారంతో మొదటి దశలో మంజూరైన 30గోదాములను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కో-ఆపరేటివ్ అధికారి రమాదేవి, వ్యవసాయ అధికారి దొరసాని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.